" మనల్ని విసిగించేది సమస్య కాదు మన ప్రవర్తనే దాని గురించి మనం కలత చెందడమే "
అవును, మనకు ఏం జరిగినా సరే కలత చెందకుండా ఒకేలా స్థిరంగా ఉండగలిగితే అప్పుడు అది అసల జరుగుతున్నట్లు ఉండదు.
యేసు కూడ అలానే చేసారు.
యేసు ఓడలొ నిద్రించు చుండగా గొప్ప తుఫాను కలిగింది. అందరు అక్కడ ఉన్న సమస్యను చూసారు కాని స్థిరంగా లేరు. యేసు అక్కడ జరిగే దానిని పట్టించుకొలేదు ఎందుకంటే ఆయన స్థిరంగా ఉన్నారు అది ఆయనను సమస్య వైపు త్రిప్పలేక పోయింది.
మనకు "ఏం జరుగుతుందో" అని అది మనల్ని మార్చెలా చేయకుండా మనం ఆపాలి. ఎలా అంటే యేసు ఆ ఓడలొ ఒక కునుకు తీసినట్లు.
గుర్తుంచుకోండి అపవాదికి మీరంటె అసహ్యం మిమ్మల్ని నాశనం చెయ్యాలి అని అనుకుంటాడు, మిరు దుఃఖంలో ఉండాలి అని అంటాడు, ఆనందించకూడదు అని అంటాడు, హీనంగా ఉండాలి అని అంటాడు, మనకు శాంతి ఉండకూడదు అని అంటాడు, మనం ఆశీర్వాదించ బడకూడదు అని అంటాడు, మనకు ఎలాంటి శక్తి అధికారం ఉండకూడదు అని అంటాడు, ఫలాలు లేని క్రైస్తవుడిగా ఉండాలి అని అంటాడు. కాని బైబిలు చెబుతుంది అంధకార శక్తులు ఆయన కాళ్ళ క్రింద ఉన్నాయి అని మనం ఆయన శరీరం కాబట్టి అపవాది మన కాళ్ళ క్రింద ఉన్నాడు.
తీర్మానించుకొండి అపవాది ఎం చేసినా సరే నేను మాత్రం స్ధిరంగా ఉంటాను అని ఎందుకంటె మనం ఆయన శరీరం. ఆయన స్ధిరంగా ఉన్నాడు మనం స్ధిరంగా ఉందాం.
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment